సీఎం వైఎస్ అనంతపురం పర్యటన వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల నార్పలలో జరగాల్సిన సీఎం పర్యటన వాయిదా వేస్తున్నట్లు సీఎంవో నుంచి ప్రకటన వచ్చింది. రేపు అనంతపురం జిల్లాలోని శింగనమలలోని నారప్పలో జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో జగన్ పాల్గొనాల్సి ఉంది. అందులో భాగంగా కంప్యూటర్ బటన్ నొక్కి వసతి దీవెన నగదును లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో నేరుగా జమ చేయాల్సి ఉంది. కానీ ఈ పర్యటనను అర్ధాంతరంగా వాయిదా వేశారు.
అనంతపురం పర్యటనను 26కు వాయిదా వేస్తున్నట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. సీఎం జగన్ సోమవారం షెడ్యూల్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. అనంతపురం పర్యటనను వాయిదా వేసుకున్న జగన్.. రేపు వన్టౌన్లోని విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగనున్న ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొననున్నారు. సాయంత్రం ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమం జరగనుంది. జగన్ పర్యటనకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోన్నారు. ఈ ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు. అందుకు తగ్గట్లు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
అనంతపురం పర్యటన రద్దు మినహా సోమవారం జగన్ షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని సీఎంవో స్పష్టం చేసింది. అయితే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ మరో బాబాయి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఆదివారం పులివెందులలో సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన వాయిదా కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. భాస్కర్ రెడ్డి అరెస్ట్తో పులివెందులలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. నల్లబ్యాడ్జీలు ధరించి భాాస్కర్ రెడ్డి అనచరులు నిరసనలు చేపడుతున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa