పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ రోజురోజుకీ మరింత బలపడుతోంది. రాష్ట్రంలో సీఎం జగన్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్క్రమాలు ప్రజలను ఆట్టుకుంటున్నాయి. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధితో ఎంతోమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. ఆదివారం అమరావతి మండలం లింగాపురంలో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. లింగాపురం గ్రామానికి చెందిన సరిపూడి శివయ్య, చెరుకూరికోటయ్య, నాయుడు వీరాంజనేయులు, ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఆదివారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పార్టీ కండువా కప్పి. వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకరరావు మాట్లాడుతూ. ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం అందరూ కలసి పనిచేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ కుటుంబంలో చేరిన ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటానని. ఎవరికి ఏ అవసరమొచ్చినా. తాను ఉన్నాననే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa