గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని పాత గుంటూరు ప్రధాన రహదారి, నంది వెలుగు రోడ్ ఆర్ అండ్ బీ పరిధిలో లో ఉండటంతో, తూర్పు వైస్సార్సీపీ నాయకురాలు నూరిఫాతిమా కార్పొరేటర్లు మహమ్మద్, ఇర్రి ధనలక్ష్మి సాయి తదితరులు ఆర్ అండ్ బీ అధికారులతో మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గుంటూరు నగర పాలక సంస్థ వారు విస్తరణ పనులు పూర్తి చేస్తున్నారని, రైల్వే గేటు వరకు రహదారిని అభివృద్ధి చేయాలని అధికారులను కోరారు. వాహనదారులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, త్వరితగతిన నూతనంగా రహదారి నిర్మించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కొద్ది రోజుల్లో రహదారుల నిర్మాణాలకు ప్రతిపాదనలు తయారుచేస్తామని ఆర్. అండ్. బి సూపరింటెండెంట్ నిర్మలా దేవి , డి ఈ రాజేంద్ర నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్లు తోట మణికంఠ , నాగేశ్వరి , వైస్సార్సీపీ నాయకులు శృంగారపు శ్రీనివాసరావు , పోలవరపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa