పరువునష్టం కేసులో దోషిగా నిర్దారణ అయి రెండేళ్ల జైలుశిక్ష ఖరారు కావడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయారు. దీంతో ఆయన ఢిల్లీలో తన అధికార నివాసాన్ని శనివారం ఖాళీ చేశారు. ఈ బంగ్లాలో రాహుల్ గాంధీ 2005 ఏప్రిల్ 22 నుంచి నివాసం ఉంటున్నారు. సరిగ్గా అదే ఏప్రిల్ 22న ఆయన ప్రభుత్వ భవానాన్ని యాదృశ్చికంగా ఖాళీచేయడం గమనార్హం. వాయినాడ్ ఎంపీని అనర్హుడిగా ప్రకటించడంతో ప్రభుత్వ భవనంలో ఉండడానికి అనర్హులు. సూరత్ కోర్టు తీర్పు వెలువడిన తర్వాత నెల రోజులు నోటీస్ పీరియడ్ ఇచ్చారు. అయితే, అనివార్య పరిస్థితుల్లో రాహుల్ గాంధీ బంగ్లా ఖాళీ చేయాల్సి వస్తోంది.
బీజేపీ ఎంపీ సీఆర్ పాటిల్ నేతృత్వంలోని లోక్సభ హౌజింగ్ కమిటీ .. బంగ్లాను ఖాళీ చేయాలని రాహుల్కు నోటీసు జారీచేసింది. దీంతో 12 తుగ్లక్ లేన్ బంగ్లాను రాహుల్ వదిలి పెట్టి.. 10న జన్పథ్లోని సోనియా నివాసానికి మారుతున్నారు. ప్రోటోకాల్ ప్రకారం రాహుల్ తన నివాసాన్ని ఖాళీ చేయాల్సి వచ్చినా.. కేంద్రం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
వాస్తవానికి పరువునష్టం కేసులో తిరిగి అప్పీల్కు గుజరాత్ కోర్టు 30 రోజుల గడువు ఇచ్చింది. ట్రయల్ కోర్టు తీర్పుపై రాహుల్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. అయినా, అక్కడ కూడా ఆయనకు ఊరట లభించలేదు. దీంతో రాహుల్ పార్లమెంట్ సభ్వత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. సూరత్ సెషన్స్ కోర్టు తీర్పు గాంధీ కుటుంబానికి చెంపపెట్టు అని బీజేపీ ఆరోపించింది. సూరత్ కోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారు. అంతకు ముందు ఏప్రిల్ 3న సూరత్ సెషన్స్ కోర్టు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa