ముఖ్యమంత్రి జగన్కు అధికారదాహం, డబ్బుపిచ్చి తప్ప ప్రజల సంక్షేమం పట్ల ఎలాంటి చిత్తశుద్ధిలేదని టీడీపీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో చిన్నాన్న వివేకానందరెడ్డి, కోడికత్తి కేసులలో వెలుగుచూస్తున్న నిజాలు...వాటినుంచి ఎదురవుతున్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఆర్-5 జోన్ అంశాన్ని తెరమీదకు తెచ్చారని ఆయన అన్నారు. రాజధాని అమరావతిలో ఆర్-5 జోన్ వ్యవహారమై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో అమరావతి ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్యయాత్రను మండలంలోని కృష్ణాయపాలెం గ్రామంనుంచి ఆయన సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ యాత్రలో పాల్గొనేందుకు రాజధాని గ్రామాల నుంచి రైతులు, రైతుకూలీలు, మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. పేదల పట్ల ముఖ్యమంత్రి జగన్కు అంత ప్రేమ, మమకారం ఉంటే రాష్ట్రంలో పేదలందరికీ కనీసం మూడేసి సెంట్ల వంతున నివేశనస్థలాలను పంపిణీ చేయాలే తప్ప బాత్రూమ్ కూడ పట్టని సెంటు భూములను ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు. పేదల సంక్షేమం పట్ల ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే పూర్తి చిత్తశుద్ధి ఉందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa