విశాఖ పరిధిలోని పెందుర్తి తిరుమల ఆస్పత్రిలో వెలుగుచూసిన కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ఈ ఘటనపై విశాఖ కలెక్టర్, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టి ఆస్పత్రిని సీజ్ చేశారని తెలిపారు. అసలు తిరుమల ఆస్పత్రికి అనుమతులే లేవని తేలడంతో, యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. తిరుమల ఆస్పత్రి వ్యవహారంలో మధ్యవర్తులుగా వ్యవహరించినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఇలాంటి ఘటనలకు తావు లేకుండా ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్రస్థాయిలో ఒక కమిటీని వేసినట్లు మంత్రి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa