ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలెక్టర్‌పై జగన్‌ విరుచుకుపడ్డారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 06, 2017, 12:29 AM

విజయవాడ, మేజర్‌న్యూస్‌: విజయవాడ సమీపంలో పెనుగంచిప్రోలు దగ్గర దివాకర్‌ ట్రావెల్‌‌స బస్సు ప్రమాదంపై  కృష్ణా జిల్లా ఎస్పీ వివరాలు వెల్లడించారు. ``ఫిబ్రవరి 28న ఉదయం 5.30 గంటల సమయంలో ఒరిస్సా రాష్ర్టం కటక్‌ నుండి హైదరాబాద్‌ వెళుతున్న దివాకర్‌ ట్రావెల్‌‌స ఓల్వో బస్సు తీవ్ర ప్రమాదానికి గురైంది : బస్సులో ఉన్న సుమారు 50 మందిలో 10 మంది మతి, 40 మందికి గాయాలయ్యాయి. మతుల్లో బస్సు డ్రైవర్‌, క్లీనర్‌ కూడా ఉన్నారు. ఉదయం 6.30 గంటలకల్లా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం సహాయ చర్యలు ప్రారంభించారు. గాయపడిన ఒక వ్యక్తి నందిగామ ఆస్పత్రికి తరలించగా ఉదయం 9 గంటలకు మతి చెందాడు. మతుల సంఖ్యను దష్టిలో పెట్టుకొని పోస్టుమార్టమ్‌ చేయడానికి 8మంది ప్రత్యేకంగా నియమించారు. మధ్యాహ్నం ఒంటి గంటకల్లా 8 మతదేహాలకు పంచనామా నిర్వహించి, పోస్టుమార్టమ్‌ మొదలు పెట్టారు. మతుల దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారున్నారు. దూర ప్రయాణాన్ని దష్టిలో పెట్టుకుని పోస్టుమార్టమ్‌ అయిన వెంటనే మతదేహాలను ప్రత్యేక వాహనాల్లో తరలించడం మొదలు పెట్టారు. 4 మతదేహాలను తరలించిన తరువాత హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్‌ తయ్యబ్‌ మతదేహాన్ని తరలిస్తుండగా వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. వైసీపీ పార్టీ అధ్యక్షు జగన్మోహన్‌ రెడ్డి చూసేందుకు మత దేహాన్ని నిలిపివేయాలని పార్టీ నాయకుల డిమాండ్గ చేశారు. జిల్లా కలెక్టర్‌, నేను ఎంతగా చెప్పినా వినపించుకోలేదు.  మధ్యాహ్నం 3.30 గంటలకు నందిగామ ఆస్పత్రికి వచ్చి కలెక్టర్‌తో 10 నిమిషాలు మాట్లాడి బస్సు పర్మిట్‌ వివరాలు కావాలని కోరారు. 9 తొమ్మిది మతదేహాల్లో 8 మతదేహాలకు పోస్‌‌ట మార్టం పూర్తయ్యింది, మిగిలినది డ్రైవర్‌ ది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ అందరికంటే ఎక్కువ ప్రభావానికి గురయ్యాడు. డ్రైవర్‌ పంచనామా కాపీ, శవ పరీక్ష నిర్వహించాల్సిందిగా డాక్టరుకు విజ్ఞాపన ప్త్రం పోలీసులు ఇచ్చారు.  ఆ కాగితాలనే జగన్మోహన్‌ రెడ్డి డాక్టర్‌ చేతిలోంచి లాక్కున్నారు. అది పోస్టు మార్టం రిపోర్టు కాదని డాక్టర్‌‌ల ఎంత బతిమాలినా జగన్మోహన్‌ రెడ్డి వినిపించుకోలేదు. ప్రతిపక్ష నాయకుడినని, 3 కాపీల్లోల ఒక కాపీ కూడా తనకివ్వరా అంటూ డాక్టరును గద్దించారు. మీడియా సమావేశం  పోస్టుమార్టమ్‌ రూములో కాకుండా బయట నిర్వహించుకోవాలని వైసీపీ నాయకులకు కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. వైఎస్‌ జగన్‌కు విజ్ఞప్తి చేయగా కలెక్టర్‌ మీద విరుచుకుపడ్డారు. డ్రైవర్‌ ఆదినారాయణ మతదేహానికి పోస్టుమార్టం శాస్త్రీయంగా నిర్వహించాం. మద్యం మత్తులో ఉన్నాడో లేదో తెలుసుకునేందుకు ఫోరెన్సిక్‌ పరీక్షల కోసం పంపాం. లగేజీలో పాటు పడుకున్న రెండవ డ్రైవర్‌ని విజయవాడ ఆస్పత్రికి తరలించా''మని ఎస్పీ వివరణలో పేర్కొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa