ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రంలో చక్రం తిప్పినప్పుడు ఏం పీకావ్‌ నారా చంద్రబాబునాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 01, 2023, 12:10 PM

చంద్రబాబు, రజనీకాంత్‌ తోడు దొంగలే..అని మంత్రి  జోగి రమేష్ విమ‌ర్శించారు.  ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు కాదు..ఎన్టీఆర్‌ను చంపిన ఖూనీకోరుల సంబరాలు అని టైటిల్‌ సరిగ్గా సరిపోయేది అభిప్రాయ‌ప‌డ్డారు. 27 ఏళ్ల క్రితం ఎన్టీఆర్‌ను తడిగుడ్డతో గొంతుకోసి చంపిన ఖూనీకోరులంతా ఒక వేదిక మీదకు వచ్చారు. వారంతా ఎన్టీఆర్‌కు దండ వేసి, దండం పెట్టి ఆయన్ను పొగుడుతున్నారు.27 ఏళ్ళ తర్వాత ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌ చేస్తావా..? ఈ 27 ఏళ్ళలో 14 ఏళ్లు చంద్రబాబు సిఎంగా ఉన్నారు. కేంద్రంలో సంకీర్ణంలో ఉన్నాడు. రాష్ట్రపతి, స్పీకర్, ప్రధానులను నియమించి కేంద్రంలో చక్రం తిప్పిన నువ్వు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇప్పించలేకపోయావా..? అని నిల‌దీశారు. కేంద్రంలో చక్రం తిప్పినప్పుడు ఏం పీకావ్‌ నారా చంద్రబాబునాయుడు. ఇప్పుడు శతజయంతి ఉత్సవాల్లో ఈ ఖూనీకోరులంతా కలిసి ఎన్టీఆర్‌కి భారతరత్న ఇప్పిస్తారట..ఎన్టీఆర్‌కు స్మారక చిహ్నం కట్టిస్తారట..ఈ నరరూప రాక్షసులు, ఈ దుర్మార్గుడైన చంద్రబాబుకు భారతరత్న ఇప్పించాలని అప్పుడు తెలియదా..?.ఇప్పుడొచ్చి స్మారక చిహ్నం నిర్మించాలని అప్పుడు తెలియలేదా..? అని ప్రశ్నించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa