ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సీఎం జగన్ పరామర్శ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 01, 2023, 10:43 PM

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి బాలాత్రిపుర సుందరమ్మ ఈ ఉదయం కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తల్లి మరణంతో ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో, సీఎం జగన్ విజయవాడ ఎంజీ రోడ్ లోని మల్లాది విష్ణు నివాసానికి వచ్చారు. తల్లి మరణంతో బాధపడుతున్న మల్లాది విష్ణును పరామర్శించారు. బాలాత్రిపుర సుందరమ్మ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అక్కడున్న ఆమె చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన వెంట మంత్రి జోగి రమేశ్ కూడా ఉన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa