వీరులపాడు మండలంలోని చౌటపల్లి గ్రామంలో గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ - ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై నమ్మకంతో ఓట్లు వేసి ముఖ్యమంత్రిగా గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రభుత్వాన్ని నేరుగా ప్రజల ఇళ్ల ముంగిటకే తీసుకువెళ్లి సంక్షేమ పథకాలను అందజేస్తున్నట్లు తెలిపారు , దేశ చరిత్రలోనే ఎక్కడా లేనివిధంగా 175 సీట్లకు గాను 151 సీట్లతో ఒక పార్టీకి అధికారాన్ని అప్పజెప్పిన ప్రజల అభిమానానికి జవాబుదారితనంగా ఈ మూడేళ్లలో చేసిన పరిపాలనను వివరిస్తూ , వారి ఇళ్ల ముంగిటకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే విధంగా కార్యచరణ రూపొందించి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు , గతంలో ఏ పాలకులు కూడా ఎన్నికలప్పుడు తప్పితే ప్రజల వద్దకు వెళ్లిన దాఖలాలు లేవని , గతానికి భిన్నంగా నేడు వైయస్ జగన్ ప్రభుత్వాన్నే నేరుగా ప్రజల వద్దకు తీసుకువెళ్తున్నారన్నారు , ప్రజల పట్ల అంకితభావంతో -చిత్తశుద్ధితో పనిచేసి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాజనీతిజ్ఞుడుగా పేరు తెచ్చుకున్నారన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మోసపు పరిపాలన చేస్తూ ప్రజలను నయవంచనకు గురి చేసాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ కార్యక్రమంలో గ్రామ కన్వీనర్ కోట సంగయ్య, ఎంపీపీ కోటేరు లక్ష్మీ ముత్తారెడ్డి, జడ్పిటిసి అమర్లపూడి కీర్తి సౌజన్య, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షహనాజ్ బేగం, మండల కన్వీనర్ ఆవుల రమేష్ బాబు, సర్పంచ్ పల్లెపోగు పుల్లయ్య, ఎంపిటిసి పల్లెపోగు మార్తమ్మ, సొసైటీ అధ్యక్షులు కోట రామారావు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు , తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa