2019లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పెద్దల సూచనలతో వైసీపీకి ‘అన్ని విధాలా’ సహకరించిన నాటి అధికార, నేటి ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో రజనీకాంత్ పై వైసీపీ నేతలు, కార్యకర్తలు మాట్లాడిన మాటలు చర్చనీయాంశమైంది. ‘రజనీ వ్యవహారంలో వైసీపీ నేతలు తొందరపడ్డారు. ఆయన పట్ల అలా మాట్లాడకుండా ఉండాల్సింది’ అంటూ అన్నాడీఎంకేకు చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. జగన్ బృందంతో తమకు సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ, ఇప్పుడు తామేం మాట్లాడినా వచ్చే లోక్సభ ఎన్నికల్లో అది తమకు చుట్టుకుంటుందని ఆయన పేర్కొన్నారు. దక్షిణ భారతదేశ వ్యాప్తంగా ఉన్న రజనీ అభిమానులు బయటకు కనిపించరని, కానీ ఆయన పట్ల ఉన్న వీరాభిమానంతో వారు ఎంతకైనా తెగిస్తారని, అందుకే రజనీతో సన్నిహితంగా ఉండేందుకు నేతలంతా ఆసక్తి ప్రదర్శిస్తుంటారని ఆయన వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa