కృష్ణా జిల్లా, బందరు మండలం బుద్ధాలపాలెం గ్రామంలో ప్రేమజంట రహస్యంగా గుడిలో పెళ్లి చేసుకుని, తమకు ఎలాంటి హాని జరగదని హామీ ఇస్తేనేబయటకు వస్తామంటూ ఆలయంలోపలే ఉండిపోయిన సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే... పట్టణానికి చెందిన కొప్పనాతి గాయత్రి, రూరల్ మండలం బుద్దాలపాలెం గ్రామానికి చెందిన కొక్కు నాగరాజు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. గాయత్రి బుద్దాలపాలెం గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తుండగా, నాగరాజు అదే గ్రామంలో కొంతకాలం వలంటీర్గా పనిచేసి మానేశాడు. వారి కులాలు వేరైనందున పెద్దలు అంగీకరించరన్న భయంతో ఎవరికీ చెప్పకుండా ఆదివారం రాత్రి బుద్దాలపాలెంలోని కోదండ రామాలయంలో రహస్యంగా పెళ్లి చేసుకుని తలుపులుమూసి అక్కడే ఉండిపోయారు. గ్రామస్థులు ఎంతగా చెప్పినా వినలేదు. తమకు హాని జరగకుండా చూస్తామని హామీ ఇస్తేనే బయటకు వస్తామని భీష్మించారు.సోమవారం సాయంత్రం వరకు ఆలయంలోపలే ఉండిపోయారు. సమాచారం అందుకున్న బందరు ఆర్పేట సీఐ రవికుమార్ సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో సిబ్బందితో బుద్దాలపాలెంలోని కోదండ రామాలయానికి వచ్చి ప్రేమజంటకు నచ్చచెప్పగా వారు బయటకు వచ్చారు. సీఐ ఇద్దరిని వెంట పెట్టుకుని బందరు తాలూకా స్టేషన్కు తీసుకువెళ్లారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa