చంద్రగిరి, మేజర్న్యూస్ : తూర్పు నియోజక వర్గాల ఎమ్మెల్సి అభ్యర్థులు పట్టాభిరెడ్డి, వాసుదేవ నాయుడులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గౌస్ బాషా, సింగిల్విండో అధ్యక్షులు సుబ్రమణ్యం నాయుడులు అన్నారు. ఆదివారం టిడిపి నాయకులు పనపా కంలో ఎమ్మెల్సి అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురికి కరపత్రాలు పంపిణి చేశారు. ఎమ్మెల్సి అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని కరపత్రాలు ప్రదర్శించారు. అనంతరం పార్టీ వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సి అభ్యర్థులైన వాసు దేవనాయుడుకు ఉపాధ్యాయులు మొదట ప్రాధాన్యత ఓటు వేయాలన్నారు. పట్టభద్రులు ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పట్టాభిరామిరెడ్డిని ఆదరించి గెలిపించాలని, ప్రతి ఒక్కరు ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అటు నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు వయోపరిమితి 60 సంవత్సరాలకు పెంచారన్నారు. నిరుద్యోగులకు ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించారని, ఉద్యోగ అవకాశాలు రానున్న రోజుల్లో చంద్రబాబు కల్పిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఐతేపల్లి సింగిల్విండో అధ్యక్షుడు పి.సుబ్రమణ్యం నాయుడు, పనపాకం సర్పంచ్ పి.మునిలక్ష్మి, నాయకులు మణియాదవ్, చెంగల్రాయులు, రాకేష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa