ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉపాధ్యాయ పక్షం టీడీపీ లక్ష్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 06, 2017, 12:35 AM

-పట్టభద్రుల ఉపాధికి పెద్ద పీట
-ఉపాధ్యాయల సంక్షేమానికి  ప్రభుత్వం కృషి  
-చంద్రబాబుతో నే రాష్ట్రం అభివృద్ధి బాట
-టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్ధులను గెలిపించుకుందాం
-శాసన మండలికి పంపి సమస్యలు పరిష్కరించుకుందాం
- ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రి శిద్ధా

దర్శి, మేజర్‌న్యూస్‌ : దేశ భవిష్యత్తు నిర్ణయించేది ఉపాధ్యాయులని...వారి అభివృద్ధికి పాటుపడగల సత్తా టీడీపీకే ఉందని రాష్ట్ర రవాణా రోడ్లు భవనాల మంత్రి శిద్ధా రాఘవరావు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నియోజకవర్గ స్ధాయి ఉపాధ్యాయులు, పట్టభద్రులు, నాయకులతో  ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. స్ధానిక శ్రీనివాస పద్మావతి కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో శ్రీ పొట్టి శ్రీరాములు విద్యా సంస్ధల డైరేక్టర్‌ వైవి సుబ్బయ్య అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా శిద్ధా రాఘవరావు మాట్లాడుతూ ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీకి ఉపాధ్యాయ, పట్టభద్రుల సమస్యల పరిష్కరించే అవకాశం ఉందన్నారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం జరగలేదని, ప్రస్తుతం పాలనలో ఉన్నాము కాబట్టి అభ్యర్ధులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఉపధ్యాయులకు 43 శాతం ఫిట్‌ మెంట్‌ ఇచ్చిన ఘనత టీడీపీదే అన్నారు. ఉపాధ్యాయ సంక్షేమానికి ఎన్నో అవకాశాలు కల్పించన ఘనత టిడిపికే దక్కుతోందన్నారు. ఉద్యోగ వివమణ వయస్సు 58 రెండు సంవత్సరాలు పెంచారన్నారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి శెలవులు 60 రోజులు కేటాయించడం, స్పెషల్‌ టీచర్ల వ్యవస్ధ ప్రవేశపెట్టడం ఇలా చెప్పకుంటూ పోతే ఎన్నో అంశాలు ఉన్నాయన్నారు. కొన్ని సార్లు బీఎస్సీ ద్వారా లక్షా 70 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం టీడీపీ ఘనతగా పేర్కొన్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌లకు ప్రారంభ జీతం రూ 36 వేలుగా నిర్ణయించడం టీడీపి తీసుకున్న గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు. త్వరలో డీఎస్సీ పూర్తి చేస్తామన్నారు. తొమ్మిదో తరగతి విద్యార్ధులకు సైకెళ్ళు పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం వంటివి విద్యార్ధులకు అందించిన వరాలన్నారు. రాష్ట్ర దినోత్సవం రోజు దీక్షా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ఉపాధ్యాయ అభ్యర్ధిగా ఏ వాసుదేవ నాయుడు, పట్టభద్రుల అభ్యర్ధులు పట్టాభిరెడ్డి రామిరెడ్డి కి ప్రధమ ఓటు వేసి సీఎం చంద్రబాబుకు లోకేష్‌కు కానుకగా ఉవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గుంటూరు ఎమ్మెల్సీ రామకృష్ణ మాట్లాడుతూ విదేశాల నుంచి ఉద్యోగులను రప్పించగల, ఉద్యోగాలు ఇవ్వగల సత్తా చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు పరిపాలన వలన భవిష్యత్తులో అవకాశం ఉంటుందన్నారు. 7వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగియనుందని, యుద్ధ ప్రాతిపదికగా ఉపాధ్యాయులు పట్టభద్రలు సమిష్టి కృషి చేసి అభ్యర్ధుల గెలుపు పాటుపడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారంశెట్టి పాపారావు, ఏఎంసీ ఛైర్మన్‌ సీహెచ్‌ సుబ్బారావు, ఎంపీపీ పోతుల సంజీవయ్య, ముండ్లమూరు ఎంపీపీ మందలపు వెంకట్రావు, తెలుగు యువత నాయకులు పోతుల పవన్‌ బాబు, వై నాగేశ్వరరావు, చిన్న, ఇతర మండల నాయకులు, ఓటర్లు ఉన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa