-విజయవాడ పశ్చిమ, పెందుర్తి, భీమిలి అసెంబ్లీ టిక్కెట్లివ్వాలి
-ఫెడరేషన్, బీసీ గుర్తింపు హామీపై సీఎంకి అభినందనలు
-ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం
-నిరుపేద మహిళలకు గ్రైండర్ల పంపిణీ
-ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం సర్వసభ్య సమావేశం తీర్మానం
విజయవాడ, మేజర్న్యూస్: రాష్ర్టంలో నగరాలకు చట్ట సభల్లో స్ధానం కల్పించా లని ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం డిమాండు చేసింది. ప్రజా ప్రాతినిధ్యం కోసం తర్వలో నగర గర్జనకు సిద్ధమవుతోంది. విజయవాడలో ఆదివారం ఆంధ్ర ప్రదేశ్ నగరాల సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా నిరుపేద మహిళలకు గ్రైండర్లు పంపిణీ చేశారు. నగరాల సత్తా నిరూపించుకునేందుకు ఇప్పటికే విజయవాడలో ముగ్గురు మహిళా కార్పొరేటర్లను గెలిపించుకున్నామని సంఘం అధ్యక్షుడు బాయన వెంకటరావు చెప్పారు. ఈసారి ఏపీలో నగరాలకు విజయవాడ పశ్చిమ, పెందుర్తి, భీమిలీ అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించాలని రాజకీయ పార్టీలకు విన్నవించారు. ఏపీ సీఎం చంద్రబాబు నగరాల సమస్యలపై సానుకూలంగా స్పందిస్తున్నారని, ఫెడరేషన్ ఏర్పాటు, బీసీలుగా గుర్తింపునకు హామీ ఇచ్చారని ప్రధాన కార్యదర్శి పోతిన వెంకటేశ్వర స్వామి వివరించారు. నగరాలను బీసీ ఏ, బీ గ్రూపుల్లోకి మార్చాల్సిన ఆవశ్యకతపై త్వరలో సీఎంకు ఒక సాంకేతిక నివేదిక అందించనున్నామని తెలిపారు. రాజకీయ పార్టీలు ఏవైనా నగరాలకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానాలు కల్పించాలని తమ్మిన సూర్యనారాయణ, పణుకు శేషూ, బీసీ సంఘం నేత పోతిన మహేష్, రాంపిళ్ళ వెంకట రమణలు డిమాండు చేశారు. దీని కోసం త్వరలో నగర గర్జన నిర్వహించాలని సంకల్పించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ సుభాషిణి, మహిళా కార్పొరేటర్లు కె. అనూరాధ, నాగోతి నాగమణి, సుకేశి సరితలను సన్మానించారు. కోశాధికారి తమ్మిన సూర్య జయ నారాయణ వార్షిక నివేదిక సమర్పించారు. ఆప్ నేత పోతిన వెంకట రామారావు, చింతాడ రాము, ఈది సూరిబాబు, పొట్నూరి రమేష్, బాయన శేఖర్ బాబు, పోతిన సాంబశిరావు, బార్ అసోసియేషన్ ప్రతినిధి పిళ్ళా రవి తదితరులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి నగరాల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa