ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ కలవరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 06, 2017, 12:38 AM

విజయవాడ, మేజర్‌న్యూస్‌:  ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో వైకాపా కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు వలస వెళితే ఆరో సీటు అధికారపార్టీదే. టిడిపి వైపు  చూసే ఓ ముగ్గురు ఎవరు? ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపాను కలవరపెడుతున్న అంశ మిదే. ఆరో సీటుకు టిడిపి పోటీ చేయాలని ఒత్తిడి పెరుగుతున్న నేపధ్యంలో ముగ్గురి ఓట్లలో తమ వారెవరన్న దానిపై వైకాపాలో చర్చ జరుగుతోంది. ఈ నెల 19న ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్ని కలు ఉత్కంఠగా మారాయి. సంఖ్యా బలం ప్రకారం టిడిపికి ఐదు , వైకాపాకు రెండు సీట్లు దక్కుతాయి. కానీ మారుతున్న రాజకీయ సమీకరణల నేపధ్యంలో ఆరవ సీటుకూ పోటీ పెట్టడం ద్వారా వైకాపాకు ఘలక్‌ ఇవ్వాలని , టిడిపి సీనియర్‌ నేతలు నాయకత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. కృష్ణా, నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఇద్దరూ ఖాయంగా వెళతారన్న అనుమానంతో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసులు ఎదుర్కొంటు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న ఎమ్మెల్యే కాకాని గోవర్దనరెడ్డి రాకపై ఆసక్తి నెలకొంది. ఆయన గైర్హాజరయితే కేసుల నుంచి ఉపశయనం లభిస్తుందన్న హామీ టిడిపి నుంచి లభించినట్లు వైకాపాలో తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఓటింగ్‌కు హజరుకాకుండ ఉంటే పరోక్షంగా ప్రభుత్వానికి సాయం చేసినట్టు ఉంటుంది. కృష్ణా జిల్లాకు చెందిన ఇధ్దరూ వైకాపా ఎమ్మెల్యేలు టిడిపి ఎమ్మెల్యేలు టిడిపికి జై కోడతారని, కాకాని విషయంలో తొందరపాటుతో వ్యాఖ్యనించడం బాగుందని వైకాపా సీనియర్‌ నేత ఒకరు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa