కడప జిల్లా, జమ్మలమడుగు మండలంలోని గండికోటలో ఈనెల 7వ తేదీ అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని జమ్మలమడుగు ఆర్డీవో శ్రీనివాసులు సూచించారు. బుధవారం ఆయన చాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యాశాఖ అధికారులతో మాట్లాడారు. మినిస్ట్రీ ఆఫ్ కల్చలర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్జెడ్సీసీ తంజావూర్వారు అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రపై వ్యాసం, జనరల్ నాలెడ్జి తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం ఉంటుందన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు ఎంఈవో క్రిష్టఫర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa