శ్రీకాకుళం జిల్లా, లావేరు మండలం బుడుమూరు వద్ద జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున విశాఖపట్నం జిల్లా మధురవాడకు చెందిన గేదెల భరత్కుమార్ (27) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసుల వివరాల మేరకు.. మధురవా డకు చెందిన భరత్కుమార్, వెంకటేష్, మధు స్నేహితులు. వీరు మంగళ వారం రాత్రి మధురవాడలో మద్యం సేవిం చారు. అనంతరం శ్రీకాకుళం రెల్లివీధిలో ఉంటున్న వెంకటేష్ అత్తవారింటికి ఈ ముగ్గురు కలిసి వచ్చారు. ఆ తర్వాత భరత్కుమార్ అదే రోజు రాత్రి విశాఖకు వెళ్లిపోతానని చెప్పడంతో.. స్నేహితులు నవభారత్ జంక్షన్ వద్ద అతన్ని విశాఖ వెళ్లే బస్సును ఎక్కించారు. ఆ తరువాత ఏమైందేమోగాని బుడుమూరు జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై తీవ్ర గాయాలతో భరత్కుమార్ పడి ఉండడాన్ని స్థానికులు గమనించి 108కు సమాచారం అందించారు. కొన ఊపిరితో ఉన్న భరత్కుమార్ను శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, ఓ పాప ఉన్నారు. భరత్కుమార్ శరీరంపై గాయాలు ఉండడంతో ఎవ రైనా హత్య చేసి పడేశారేమోనన్న అనుమానాన్ని కుటుంబ సభ్యులు వ్యక్తంచే స్తున్నారు. లావేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa