చీడికాడ మండలంలోని దిబ్బపాలెం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ మధుమంతి మహేష్ ప్రమాదవసాత్తు మరణించినట్లు దిబ్బపాలెం కోపరేటివ్ ప్రెసిడెంట్ నందారపు రమణబాబు తెలిపారు. అయన అందించిన వివరాలు ప్రకారం మృతుడు రాజస్థాన్ లో సూరత్ ఘర్ ఆర్మీలో సిపాయిగా పనిచేస్తున్నాడని ఆర్మీ పనినిమిత్తం ఢిల్లీవెళ్లి శుక్రవారం ఉదయం తిరిగి వస్తూ మధ్య మార్గంలో ట్రాఫిక్ అంతరం ఏర్పడడంతో ట్రాఫిక్ క్లియర్ చేస్తుండగా వాహనదారుడు వచ్చి ఢీకొట్టడంతో సిబ్బంది హుటా హుటేనా హాస్పిటల్ కు తరలించారన్నారు. పరిస్థితి విషమంచడంతో మధ్యాహ్నం చనిపోయినట్లు అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. మృతునికి గత ఫిబ్రవరి 22న ఉమ తో వివాహం జరిగింది. కాళ్ల పారాణి ఆరక ముందే మహేష్ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలనుకున్నాయి. మాజీ ఎంపిపి దారపు సత్యనారాయణ, పిఎసిఎస్ అధ్యక్షులు యన్ రమణబాబు, స్నేహితులు కుటుంబ సభ్యులకు తమ సంతాపన్ని తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa