తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (సోమవారం) శ్రీవారి సర్వదర్శనానికి ఒక్క కంపార్టుమెంట్లో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఆదివారం 74,876 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.56 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 30,695 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa