ఆదిరెడ్డి కుటుంబంపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. నేడు రాజమండ్రిలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఎవరూ ఫిర్యాదు చేయకుండా సీఐడీ పోలీసులు అక్రమ కేసులు బనాయించారన్నారు. మహానాడు ఏర్పాట్లు చేస్తుంటే జగన్కు జ్వరం వచ్చిందన్నారు. ఆయనకు జ్వరం వస్తే సీఐడీ మందును ప్రజల్లోకి వదులుతారన్నారు. టీడీపీ నేతలను జైలులో పెట్టి జగన్ పైశాచికానందం పొందుతున్నారన్నారు. పోలీసు కేసు అంటే టీడీపీ నేతలు భయపడరని అనిత అన్నారు. జగనే మా నమ్మకం స్టిక్కర్లను కుక్కలు, కోతులు చింపేస్తున్నాయన్నారు. జగన్ సైకో పాలనలో ఎస్సీలు, గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అనిత పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa