మునగపాక: మండలంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సచివాలయం - 1, 2 పరిధిలో మంగళవారం శాసనసభ్యులు యు. వి రమణమూర్తి రాజు (కన్నబాబు) మరియు మాజీ డిసిసిబి చైర్మన్ యు. సుకుమార్ వర్మ (తేజ) మరియు రాష్ట్ర గవర్నర్ కార్పొరేషన్ చైర్మన్ బొడ్డడ ప్రసాద్ మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గడప గడపకి తిరుగుతూ జగనన్న సంక్షేమ పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు అందిన లబ్ధి గురించి వివరిస్తూ ప్రజలను అర్హత ఉండి ఇళ్ల స్థలాలు గాని ఇళ్ల స్కీమ్ గాని సంక్షేమ పథకాలు గాని రాలేదా అని అడిగి తెలుసుకుని రాలేదు అన్నవారికి తక్షణమే వారికి ఆ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సచివాలయ సిబ్బందిని ప్రభుత్వాధికారులను ఆదేశాలు జారీచేశారు.
ఈ సమయంలో మునగపాక ఎస్సీ కాలనీలో సుమారు 60 కి పైగా ఇల్లు శ్లబ్లు లీకేజీ లు అవుతున్నాయని కాలనీ వాసులు ఎమ్మెల్యేకి తెలియజేశారు. ఈ సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే తక్షణమే హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులను బిల్డింగ్ స్లాబ్ లకు మరమ్మతులు చేయుటకు అవసరమైన సుమారు 650 సిమెంట్ బస్తాలు వారి సొంత నిధులతో కొనుగోలు చేసి ఇస్తామని కాలనీ వాసులకు హామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయ లక్ష్మి, జడ్పీటీసీ పెంటకోట స్వామి సత్యనారాయణ, మండల కన్వీనర్ ఆడారి అచ్చయ్య నాయుడు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, పలు శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa