ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనన్న మళ్లీ ముఖ్యమంత్రిగా దీవించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 09, 2023, 03:37 PM

మంత్రాలయం: జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా దీవించాలని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు ప్రదీప్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిధిలోని ఓంనగర్, సింగరాయనహళ్లిలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న సంక్షేమ పథకాలు అమలు, వాటి లబ్ధిపై ఆరా తీశారు. జగనన్న ద్వారానే పేదలకు సంక్షేమ పథకాలు సాధ్యమని స్పష్టం చేశారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa