ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు, అశోకగజపతిపై మంత్రి రోజా ఫైర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 09, 2023, 03:37 PM

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, కేంద్ర మాజీ మంత్రి అశోకగజపతి రాజుపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. సోమవారం విజయనగరంలో రాష్ట్రంలో తొలి మహిళా పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కనబడిన ప్రతి శిలాఫలకం వద్ద సెల్ఫీలు తీసుకుంటూ టీడీపీ నాయకులు పూర్తిగా సెల్ఫిష్ గామారిపోయారని ఎద్దేవా చేశారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో శిలాఫలకాలు వేయడం తప్ప ఏ ప్రాజెక్టు ప్రారంభించిన దాఖలాలు కనిపించలేదన్నారు. పదిహేడేళ్ల పాటు రాష్ట్ర, కేంద్ర మంత్రి పదవులను అనుభవించడమే తప్ప అశోక్ గజపతిరాజు విజయనగరం ప్రాంతానికి, ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. చివరకు విజయనగరం పట్టణాన్ని నగరపాలక సంస్థగా మార్చి అభివృద్ధికి బాటలు వేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని చెప్పారు. విజయనగరం సహా రాష్ట్రంలో ఒకేసారి 15 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa