తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో రాజకీయాలు వేడెక్కాయి. అనూహ్యంగా వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు టీడీపీ ఇంఛార్జ్ బొజ్జల ఇంటికి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు హరినాథ రెడ్డి తొలి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఎవరూ ఊహించని విధంగా అధికార పార్టీలోని కొందరు నేతలు, పార్టీలకు అతీతంగా తటస్థంగా ఉన్న వారు కూడా బొజ్జల ఇంట్లో ప్రత్యక్షం అయ్యారు.
బొజ్జల కుటుంబానికి శ్రీకాళహస్తిలో మంచి పేరు ఉంది.. దీంతో పార్టీలకు అతీతంగా బొజ్జల సోదరులకు నివాళులర్పించేందుకు నియోజకవర్గంతో పాటు పొరుగు ప్రాంతాల నుంచి జనాలు, నేతలు ఊరందూరులోని బొజ్జల ఇంటికి వచ్చారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే సత్రవాడ మునిరామయ్య అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు కూడా బొజ్జల ఇంటికి వచ్చారు. ఆయన కొంతకాలంగా వైఎస్సార్సీపీ అధిష్టానం తీరుపై ఆగ్రహంతో ఉన్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడు టీడీపీ నేత ఇంటికి వెళ్లడం ఆసక్తికరంగా మారింది.
అలాగే తొట్టంబేడు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ వాసుదేవనాయుడితో పాటు మరికొందరు నేతలు 15మంది వరకు బొజ్జల ఇంటికి వచ్చి నివాళులర్పించారు. అధికార పార్టీ నేతలు బొజ్జల కుటుంబంతో సమావేశమై కొద్దిసేపు మాట్లాడారు. బొజ్జలకు పార్టీలకు అతీతంగా గౌరవించేవారు ఉన్నారు.. కానీ సడన్గా బొజ్జల ఇంటికి వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అధికార పార్టీలో కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న వారంతా ఇలా ఒక్కటవుతున్నారనే చర్చ జరుగుతోంది. అందరూ కలిసి స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డికి హ్యాండ్ ఇస్తారా అనే చర్చ జరుగుతోంది.
మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు పార్టీ మారతారని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశపడ్డారట.. కానీ ఆయనకు పదవి ఇవ్వకుండా టీడీపీ నుంచి వెళ్లిన సిపాయి సుబ్రహ్మణ్యంకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో అసంతృప్తిగా ఉన్నారని టాక్ వినిపించింది. ఎస్సీవీ నాయుడు 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీకాళహస్తిలో పోటీచేసి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిపై విజయం సాధించారు. 2009లో మళ్లీ బొజ్జలపై పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత నాయుడు టీడీపీలో చేరారు.. మళ్లీ 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీలోకి వెళ్లారు.
మాజీ ఎమ్మెల్యే సత్రవాడ మునిరామయ్య కూడా ఇటీవల టీడీపీలో చేరారు. ముని రామయ్య 1985లో శ్రీకాళహస్తి ఎమ్మేల్యేగా.. ఆ తర్వాత తుడా చైర్మన్ గా పని చేశారు. ఆయన కుమారుడు ప్రవీణ్ వైఎస్సార్సీపీ స్టేట్ యూత్ జనరల్ సెక్రెటరీ గా ఉన్నారు. వీరు 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్సపీపీలో చేరారు.. కానీ ఇటీల పరిణామాలతో పార్టీ మారారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa