ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గంజాయి మత్తులోనే యువకుడి హత్య,,,ఉక్కు పాదం మోపాలన్న చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 09, 2023, 09:27 PM

రాష్ట్రంలో గంజాయి యువత ప్రాణాలు తీస్తుంది.. వారిని హంతకులనూ చేస్తోంది అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. విజయవాడ గంజాయి ఘటనపై ట్వీట్ చేశారు. గంజాయి పై ఉదాసీనత దాన్ని మన బిడ్డల వరకూ తెస్తోందన్నారు. ఏపీలో విచ్చలవిడి గంజాయి వినియోగం యువత భవిష్యత్తుని నాశనం చేయడమే కాదు.. ఏకంగా ప్రాణాలను కూడా తీస్తోంది అన్నారు.


విజయవాడ సమీపంలో గంజాయి మత్తులో జరిగిన చిన్న గొడవ ఏకంగా అజయ్ సాయి అనే యువకుడి ప్రాణాలు తీసిందని.. మరో 5 గురిని హంతకులను చేసింది. దీనికి ఈ ప్రభుత్వ సమాధానం ఏంటి అని ప్రశ్నించారు. వాడవాడలా విస్తరిస్తున్న గంజాయిపై ఇంత ఉదాసీనత ఎందుకని.. ఒకసారి గంజాయికి అలవాటు పడిన వారి జీవితం ఎంత ప్రమాదంలోకి వెళ్తుందో అధికారులు అర్థం చేసుకోరా అన్నారు. ఈ ఉదాసీనత వల్ల గంజాయి మహమ్మారి మన బిడ్డల వరకు వస్తుంది అని మర్చిపోకండి.. పక్కా ప్రణాళికతో గంజాయి సరఫరాపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు.


విజయవాడ సమీపంలో జరిగిన ఓ హత్య ఘటనను చంద్రబాబు ప్రస్తావించారు. కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్‌స్టేషన్‌ కానూరు శ్మశానం రోడ్డులో నాగార్జున, అజయ్‌సాయి, ప్రశాంత్‌, మణికంఠ, మరో ఇద్దరు కలసి ఆదివారం సాయంత్రం గంజాయి తాగుతున్నారు. ఇంతలో అజయ్‌ సాయి ఇయర్‌ బడ్స్‌ తీసుకుని తిరిగివ్వలేదని.. యువకుల మధ్య గొడవ మొదలైంది. ఆ తర్వాత అక్కడి నుంచి అందరూ వెళ్లిపోయారు. మళ్లీ ఆదివారం అర్ధరాత్రి యువకుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఐదుగురు యువకులు అజయ్‌ సాయిపై గంజాయి మత్తులో దాడి చేయడంతో.. అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.


ఆ తర్వాత అందరూ కలిసి ఓ ప్లాన్ వేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లు నమ్మించేందుకు సిద్ధమయ్యారు. ప్రశాంత్‌, మణికంఠలు బైక్‌పై అజయ్‌ సాయిని పటమట డొంక రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కంకిపాడు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడని చెప్పి ఆస్పత్రికిలో చేర్చారు. వెంటనే డాక్టర్లు కంకిపాడు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఆస్పత్రికి వచ్చి ఆరా తీశారు. ఈ క్రమంలో అజయ్‌ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు.


అజయ్ ఒంటిపై ఉన్నవి రోడ్డు ప్రమాదం వల్ల తగిలిన గాయాలు కావని డాక్టర్లకు పోలీసులకు చెప్పారు. వెంటనే పెనమలూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా.. మరో మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. అయితే మృతుడిపై ఇప్పటికే పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో గంజాయి కేసు ఉందని తెలుస్తోంది. యువకులు గంజాయి మత్తులోనే అజయ్ సాయిపై దాడి చేశారని చెబుతున్నారు. ఈ ఘటనను చంద్రబాబు ప్రస్తావించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa