జగనన్నకు చెబుదాం కార్యక్రమం పై టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...... రాష్ట్రానికి పెద్ద సమస్యగా మారిన జగన్రెడ్డికి చెప్పుకోవడం వల్ల ప్రజలకు ఒరిగేదేమిటి? స్పందన కార్యక్రమం చేపట్టి నాలుగేళ్లైనా ఒక్క సమస్యనైనా పరిష్కరించారా? తాడేపల్లి ప్యాలస్ గడప దాటి ప్రజల్లోకి నేరుగా వచ్చి సమస్యలు వినలేని ముఖ్యమంత్రి ఆపరేటర్ ఫోన్కాల్ ద్వారా వచ్చే సమస్యలను ఏమి పరిష్కరిస్తారని ప్రశ్నించారు. 1902 పేరుతో పెట్టిన హెల్ప్లైన్ పెద్ద బోగస్ అని, తన అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ కొత్త పథకాలని ఆరోపించారు. టీడీపీ హయాంలో పీపుల్స్ ఫస్ట్ పేరుతో సమస్యలు తెలుసుకుని, 1100 టోల్ఫ్రీ నంబరు ద్వారా వచ్చిన సమస్యలు ఏ దశలో ఉన్నాయో సీఎం డ్యాష్ బోర్డుకు అనుసంధానం చేసి, ఎప్పటికప్పుడు పరిష్కార చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa