ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 27, 28న ఉమ్మడి జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 10, 2023, 03:26 PM

ఈ నెల 27, 28 న బుగ్గన శేషా రెడ్డి మెమోరియల్ ఇండోర్ స్టేడియం డోన్ లో ఉమ్మడి కర్నూల్ జిల్లా పురుషుల డబుల్స్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు డోన్ మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్. శుభం విల్లా హోమ్స్ దేవేలేపర్స్ మేనేజింగ్ పార్టనర్స్ అర్జున్ రెడ్డి, ప్రశాంత్ కొంగటి గార్ల సౌజన్యంతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. మొత్తం మూడు విభాగాల్లో ఈ టోర్నీ జరుగుతుందని, ఓపెన్ క్యాటగిరి, 30 నుండి 40 సంవత్సరాల క్యాటగిరి, 40 సంవత్సరాల పైబడిన క్యాటగిరిలలో పోటీలు జరుగుతాయని, మొదటి స్థానంలో గెలిచిన వారికి 25, 000 నగదు మరియు ట్రోఫీ. రెండవ స్తానంకి 12, 500 రూపాయలు మరియు ట్రోఫీ, మూడవ స్థానంలో నిలిచిన రెండు జట్లకు 7, 500 రూపాయలు చొప్పున నగదు ట్రోఫీలు అందచేస్తామన్నారు. ఈ టోర్నమెంట్ లో పాల్గొనే ప్రతి క్రీడాకారులకు ఉచితంగా జెర్సీ టీషర్టులు, భోజనం మరియు వసతి ఏర్పాట్లు చేస్తున్నామని టోర్నీ స్పాన్సర్స్ ప్రశాంత్ కొంగటి, అర్జున్ రెడ్డి లు తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఈనెల 25వ తేదీ లోపు 9515951541 నెంబర్ కు వాట్సాప్ లో 300 రూపాయల సభ్యత్వ రుసుము చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని, అదేవిధంగా తప్పనిసరిగా ప్రతి క్రీడాకారుడు ఆధార్ కార్డు తీసుకుని రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు వెంకటరామ్, జాహీద్, అనార్ కరుణాకర్, సుమన్, ప్రేమ్, సిద్దారెడ్డి, జనకిరాముడు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa