కాపు నేత ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గం నేతలను ఉద్దేశించి బుధవారం లేఖ రాశారు. ఈ సందర్భంగా తన రాజకీయ రంగ ప్రవేశంపై కీలక ప్రకటన చేశారు. అదే సమయంలో తుని రైలు దగ్ధం కేసును రైల్వే కోర్టు కొట్టివేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రైలు దగ్ధం సమయంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. అప్పుడు పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టారని, తీహార్ జైలుకు వెళ్లాలని లేదా అండర్ గ్రౌండ్ కు వెళ్లాలని అప్పుడు తనకు సూచన చేశారని, కానీ అలా చేస్తే కులంతో పాటు ఉద్యమం చులకన అవుతుందని భావించినట్లు చెప్పారు. నాటి డీజీపీకి కూడా రైలు దగ్ధం కేసును తన పైనే పెట్టాలని, సభకు వచ్చిన వారిని బాధ్యులుగా చేయవద్దని కోరినట్లు చెప్పారు. ఈ కేసును వాదించేందుకు పలువురు లాయర్లు ముందుకు వచ్చారని గుర్తు చేసుకున్నారు.
తన తాత, తండ్రి నడిచిన దారిలోనే తాను నడుస్తున్నానని, జాతిని తాకట్టు పెట్టలేదని, ఉద్యమాలే ఊపిరిగా పని చేశానని ఆ లేఖలో పేర్కొన్నారు. తాను జీవితంలో కోర్టుకు వెళ్లలేదని, తుని ఘటన తర్వాత ప్రతి వాయిదాకు కోర్టుకు వెళ్లానని, తనకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందన్నారు. ఈ ఘటనకు సంబంధించి జరిగిందేదో జరిగిపోయిందనీ, ఇందుకు తాను ఎవరినీ నిందించడం లేదన్నారు. తుని ఘటన కేసులో కోర్టు తీర్పు ఎలా ఉంటే అలా నడుచుకుందామని భావించానని, ఉరిశిక్ష వేసినా అప్పీల్ కు వెళ్లవద్దని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa