గాలి ముద్దుకృష్ణ నాయుడు 76వ జయంతి పురస్కరించుకొని గాలి జగదీష్ యువసేన ఆధ్వర్యంలో శుక్రవారం గాలి ముద్దుకృష్ణమ నాయుడు మెమోరియల్ మెగా క్రికెట్ టోర్నమెంట్ గోడ పత్రికల ఆవిష్కరణ కార్యక్రమం పుత్తూరు లోని జీఎంకే ట్రస్ట్ భవనంలో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా గాలి జగదీష్ మాట్లాడుతూ నగరి నియోజకవర్గంలోని గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి మెగా క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 25 వ తారికు నుండి జూన్ 9 వ తేదీ వరకు టోర్నీ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ టోర్నీ లో గెలుపొందిన విజేత కు 2, 00, 000 ల రూపాయలు మొదటి బహుమతి , రెండొవ బహుమతి 1, 00, 000 రూపాయలు, మూడవ బహుమతి 60, 000 రూపాయలు, నాల్గవ బహుమతి 40, 000 రూపాయలు, మరియు మ్యాన్ ఆఫ్ సిరీస్ 10, 000 రూపాయలు ఇవ్వనున్నట్టు తెలిపారు మరియు టోర్నీ హార్డ్ టెన్నిస్ బాల్ తో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రవేశం ఉచితం అని మీడియాకు తెలిపారు, ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ధన, అమర్నాథ్, దిలీప్, విక్రమ్, భగత్ రెడ్డి, సుమన్, హరీష్, పుల్లారెడ్డి , మన స్వామి , మనోజ్ థామస్ , రూపేష్, సురేష్ ఉప్పలపాటి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa