ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంచాయతీ నిధులు ఇవ్వండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 13, 2023, 04:11 PM

వైసీపీ ప్రభుత్వం వచ్చాక పంచాయతీలకు నిధులు కరువయ్యాయని, ఇలా అయితే గ్రామాల అభివృద్ధి ఎలా సాధ్యపడు తుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు. రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం, ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌ సదస్సు శుక్రవారం విజయనగరంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 14, 15 ఆర్థిక సంఘాల నిధులు ఏమయ్యాయని ప్రభు త్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 12,918 పంచాయతీలకు రావాల్సిన రూ.8,200 కోట్లు పంచాయతీల ఖాతాలకు జమ కాలేదన్నారు. పంచా యతీల నిధులను ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించడం దారుణమన్నారు. ‘‘ సీఎం.. వలంటీర్‌.. మధ్యలో వ్యవస్థ అంతా నాశనమైపోయింది. వలంటీరు వ్యవస్థతో సర్పంచ్‌, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ నుంచి ఎంపీ, ఎమ్మెల్యే వరకూ పనిలేకుండా పోయింది’ అన్నారు. పంచాయతీలు విద్యుత్‌ బిల్లులు చెల్లించనవసరం లేదని, దీనిపై గతంలో విడుదల చేసిన జీవోలు ఉన్నాయని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa