ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్యాయం జరుగుతుంటే అడగరేంటి...?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 13, 2023, 04:17 PM

పెద్దన్న పాత్ర పోషించాల్సిన ఉద్యోగ సంఘం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ఏపీ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంసాని శ్రీనివాసరావు విమర్శించారు. ఉద్యమం అక్కర్లేదని చౌకబారు ప్రకటనలు చేయడం ఉద్యమానికి ద్రోహం చేయడమేనం టూ.. ఏపీఎన్‌జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావుపై పరోక్ష విమర్శలు చేశా రు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకత్వాల విభేదాల పరిష్కారానికి సంబంధించి ఏపీజేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు అధ్యక్షతన శుక్రవారం ఇక్కడ సమావేశం జరిగింది. ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం రాష్ట్ర నాయకత్వంలో ఇటీవల విభేదాలు తలెత్తాయి. దీంతో రాష్ట్ర అధ్యక్షునికి ఓడీ సౌకర్యాన్ని ప్రభుత్వం తొలగించింది. ఈ నేపథ్యంలో విభేదాలు పొడచూపిన నాయకులతో మాట్లాడి వారిని కలిసికట్టుగా ఉండాలని ఈ సమావేశంలో సూచించారు. తమ సంఘ నాయకుల మధ్య విభేదాలను పరిష్కరించి తిరిగి ఓడీ సదుపాయాన్ని పునరుద్ధరించేందుకు దోహదపడిన బొప్పరాజుకు సంసాని శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa