సామూహిక శ్రమదానంతో సుందర తిరుమల కార్యక్రమాన్ని అలిపిరి వద్ద సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి.రమణ శనివారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్వచ్ఛంద సేవతో సుందర తిరుమలకు పూనుకోవటం అభినందనీయమన్నారు. న్యాయమూర్తులకు స్వచ్ఛందసేవకు అవకాశం కల్పించాలని 2008లో అప్పుడు జేఈవోగా ఉన్న ధర్మారెడ్డిని కోరినట్లు తెలిపారు. తిరుమల పవిత్రత తమ కర్తవ్యంగా ప్రతి భక్తులు భావించాలని అన్నారు. సుందర తిరుమల కార్యక్రమంలో పాల్గొనడం దేవుడు ఇచ్చిన వరమని అన్నారు. అనేక దేవతలు సంచరించిన సప్తగిరులకి ఎంతో పవిత్రత ఉందన్నారు. శ్రీవారి దర్శనార్ధం వచ్చే ప్రతి ఒక్క భక్తుడు ఈ ప్రాంతాన్ని పవిత్రంగా చూసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్తో పాటు ఇతర వ్యర్ధాలనునిర్ధేశించిన ప్రాంతాల్లోనే భక్తులు వేయాలన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు తిరుమలలో ఆహ్లాదకర వాతావరణాన్ని నెల్కొలపడానికి భక్తులు సహకరించాలని కోరారు. భక్తులు కూడా శుద్ధ తిరుమల.. సుందర తిరుమల కార్యక్రమంలో పాల్గొనాలని మాజీ సేజే ఎన్వీ రమణ పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa