ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బసవరాజ్ బొమ్మై కార్యాలయ ప్రాంగణంలో కనిపించిన కోబ్రా

national |  Suryaa Desk  | Published : Sat, May 13, 2023, 05:14 PM

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా కర్ణాటక షిగాన్ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఒక అవాంఛనీయ సంఘటన గందరగోళానికి కారణమైంది. ఆఫీస్ లోని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కార్యాలయ ప్రాంగణంలో ఓ కోబ్రా కనిపించింది. బొమ్మై కార్యాలయానికి వచ్చిన కాసేపటికి కోబ్రాను గుర్తించిన కార్యకర్తలు, నాయకులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ పామును పట్టి, అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. ఈ పామును పట్టుకునే సమయంలో సీఎం బొమ్మై అక్కడే ఉన్నారు. కింగ్ కోబ్రా వల్ల ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa