కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలంలోని అన్నిగ్రామాల్లో ఓటర్ల లిస్ట్ వెరిఫికేషన్, ఇదేమి కర్మ మనరాష్ట్రానికి తదితర కార్యక్రమాలు త్వరితగతిన పూర్తిచేయాలని టీడీపీ మాజీ ఎంపీ, గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ కమిటీ అధ్యక్షులు కొనకళ్ల నారాయణ సూచించారు. టీడీపీ ఉంగుటూరు మండల సర్వసభ్య సమావేశం ఆదివారం తేలప్రోలులోని పార్టీ మండల కార్యాలయంలో ఆరుమళ్ల వెంకటకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన కొనకళ్ల మాట్లాడుతూ, వైసీపీ అరాచకపాలనపట్ల ప్రజలను చైతన్య పరచటంలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో సమిష్టిగా కలిసి పనిచేయాలన్నారు. రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని, ఈ నేపథ్యంలో పార్టీశ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. ఇందులో భాగంగా ఈనెల 21 ఆదివారం గన్నవరంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిపేందుకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మండవ రమ్యకృష్ణ, కొండేటి కొండలరావు, వెంకటేశ్వరరావు, బచ్చుల బోస్బాబు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa