సమస్త సృష్టిని రక్షించగల సర్వశక్తి సంపన్నుడు అంజనేయుడు అని విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పురాణపండితుడు వేంకటేశ్వరశాస్త్రి అన్నారు. వైశాఖ బహుళ దశమిని పురస్కరించుకుని ఆంజనేయస్వామి జయంతి కార్యక్రమాన్ని దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ప్రధాన ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామికి, ఘాట్రోడ్డు ఆలయంలో కొలువైన ఆంజనేయస్వామికి ఆదివారం అభిషేకాలు, అర్చనలు చేశారు. ఘాట్రోడ్డులోని ఆలయం వద్ద హవనం నిర్వహించారు. భక్తులకు వడపప్పు, పానకం, అప్పాల ప్రసాదాలను పంపిణీ చేసినట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు. ఆలయ ట్రస్ట్బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు దంపతులు, సభ్యులు బుద్దా రాంబాబు, చింకా శ్రీనివాసులు, ముఖ్య అర్చకుడు శ్రీనివాసశాస్త్రి పాల్గొన్నారు. ఆదివారాన్ని పురస్కరించుకుని ఆలయంలో సూర్యనమస్కారాలు, అరుణ పారాయణం నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa