మర్రిపాలెం సబ్ స్టేషన్ పరిధిలో సోమవారం విద్యుత్తు ఫీడర్లకు మరమ్మతులు నిర్వహిస్తుండటంతో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తున్నట్లుగా జోన్-2 ఈఈ బి. కె. నాయుడు తెలి యజేశారు. సాయినగర్, పంజాబుహోటల్, గ్రీన్గార్డెన్స్, హుస్సేన్ నగర్, పార్వతీనగర్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోనున్నట్లుగా తెలిపారు.
అక్కయ్యపాలెం 11 కె. వి. కైలాస పురం ఫీడర్ సోమవారం ఉదయం, మధ్యాహ్నం వేళల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుం దని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి. సత్యనారాయణ ఓ ప్రకట నలో తెలిపారు. దీనిలో భాగంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కైలాసపురం మెయిన్ రోడ్డు, దుర్గాకైలాసనగర్, కస్తూరినగర్ 12, మధుసూదన్ నగర్, శ్రామికనగర్ ప్రాంతాలలో విద్యుత్తు నిలిపివేస్తా మన్నారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కైలాసపురం మెయిన్ రోడ్డు, శాంతినగర్, ఎం. ఇ. ఎస్. గేట్ ప్రాంతాల్లో ఉండదని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa