89దవ వార్డు గణేష్ నగర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గోపాలపట్నం మండల అధ్యక్షుడు గొర్ల అప్పలరాజు ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎపి భాజపా ప్రోటోకాల్ కన్వీనర్ బాల రాజేశ్వరరావు, పశ్చిమ నియోజకవర్గం కన్వీనర్ దాడి పురుషోత్తమ రమేష్ హాజరయ్యారు. దాడి రమేష్ మాట్లాడుతూ.. సంస్థాగతంగా బూత్ స్థాయి కమిటీలు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రవేశపెట్టిన పథకాలపై బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయిల వరకు ప్రతి గడపగడపకు తిరిగి నరేంద్ర మోడీ 9 సంవత్సరాలలో ప్రవేశపెట్టిన పథకాలను కరపత్రాలు పై ముద్రించి ప్రజలకి వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం, ఎల్ శ్రీను, కృష్ణ, సత్యనారాయణ, పాండు, ఈ కామేశ్వరరావు, సూరిబాబు, శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa