వివేక హత్య కేసులో హైకోర్టులో సుదీర్ఘంగా సాగిన వాద ప్రతివాదనల అనంతరం సీబీఐకి హైకోర్టు కీలక సూచనలు చేసింది. బుధవారం (మే 31) వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. బుధవారం రోజు తీర్పు ప్రకటిస్తామని హైకోర్టు వెల్లడించింది. అప్పటి వరకు అవినాష్ రెడ్డిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని మధ్యతంర ఉత్తర్వులు జారీ చేసింది ఉన్నత న్యాయస్థానం. అయితే.. ఈ కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో నిన్నటి నుంచి వాదనలు జరుగుతుండగా.. వాటికి కొనసాగింపుగా ఈరోజు కూడా హైకోర్టులో విచారణ జరిగింది. అయితే.. ఈ విషయంలో... ఇరువైపులా వాదనలు హాట్ హాట్గా సాగాయి.
రాజకీయ ఉద్దేశాలే వైఎస్ వివేకా హత్యకు ప్రధాన కారణమని సీబీఐ ఆరోపించింది. వివేకా హత్యకు.. నెల రోజుల ముందు నుంచే కుట్ర జరిగిందని సీబీఐ ఆరోపించింది. శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి ద్వారా అవినాష్ రెడ్డి హత్యకు ప్లాన్ చేశారని సీబీఐ ఆరోపించింది. అయితే.. అవినాష్ రెడ్డి మాత్రం విచారణకు సహకరించడం లేదని న్యాయస్థానానికి సీబీఐ చెప్పింది. నోటీసులు ఎప్పుడు ఇచ్చినా విచారణకు రాకుండా తప్పించుకుంటున్నారన్నారు. కోర్టులకు వెళ్లి నోటీసులు తెచ్చుకుని కాలయాపన చేస్తున్నారని తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే పలువురుని విచారించామని మరికొందరిని అరెస్ట్ చేశామని తెలిపిస అవినాష్ రెడ్డి.. వాళ్లెవ్వరీ లేని ప్రత్యేకత అవినాష్ రెడ్డికి ఏందుకంటూ ప్రశ్నించారు. అవినాష్ రెడ్డిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని న్యాయస్థానానికి సీబీఐ తెలిపింది.
హైకోర్టు కూడా సీబీఐ దర్యాప్తుపై కీలక ప్రశ్నలు వేసింది. ఈ కేసు దర్యాప్తులో జాప్యంపై సీబీఐని కోర్టు నిలదీసింది. అయితే.. అందుకు సమాధానంగా ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని సీబీఐ తెలిపింది. మరోవైపు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారని కోర్టు ప్రశ్నించింది. ఈ హత్య కేసులో సాక్ష్యాలను ఉదయ్ కుమార్ రెడ్డి తారుమారు చేశారని సీబీఐ వివరించింది. అయితే.. విచారణకు వీళ్లెవ్వరూ సహకరించడం లేదని తెలిపారు. వీరంతా సహకరిస్తే కేసు దర్యాప్తు ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa