రాష్ట్ర ప్రజల గుండెలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ స్థానం సంపాధించారని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. ఇదిలావుంటే తిరుమల శ్రీవారిని మంత్రి జోగి రమేష్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో.. కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి.. స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
ఆలయ బయట జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మేనిఫెస్టోను చింపి పార్సెల్ పంపుతున్నానని చెప్పారు. 2014లో చంద్రబాబు 650 హామీలు ఇచ్చారని.. ఆ హామీల్లో కేవలం పదింటిని కూడా అమలు చేయలేదని వివరించారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. మురికి పట్టి మలినమైన చంద్రబాబును ప్రజలు నమ్మె స్ధితిలో లేరని.. శతకోటి వాగ్దానాలు ఇచ్చినా టీడీపీని ప్రజలు నమ్మబోరని వ్యాఖ్యానించారు.
ఓ వైపు సంక్షేమం.. మరోవైపు అభివృద్ధితో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాల పాల దిగ్విజయంగా సాగిందన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో.. ఏ రాష్ట్రంలో ఏ సీఎం చేయని అభివృద్ధిని జగన్ చేశారని వ్యాఖ్యానించారు. రెండు లక్షల 11 వేల కోట్ల రూపాయలు నేరుగా పేదల ఖాతాలోకి జమ చేశారని వివరించారు. 35 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు అందించి.. నిర్మాణ పనులు శరవేగంగా చేస్తున్నామని గుర్తు చేశారు.
ఇదిలావుంటే తిరుమల శ్రీవారిని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం సామినేని ఉదయభాను కుటుంబ సభ్యులతో కలిసి.. స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో.. వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి.. స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa