విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ పరిధిలోఅర్ధరాత్రి కారును అడ్డగించి 50 లక్షల రూపాయల నగదు పట్టుకొని పరారయ్యారు దుండగులు. రెండు బైకులపై వచ్చిన నలుగురు దుండగులు కారును అడ్డగించి, నాటు తుపాకీలతో బెదిరించి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. కారులో పెద్ద మొత్తంలో నగదు ఉందనే పక్కా సమాచారంతోనే ఈ చోరీకి పాల్పడినట్లు అనుమానం కలుగుతోంది. బాధితుల ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..
పర్లాకిమిడికి చెందిన బియ్యం వ్యాపారి కోట్ల వంశీకృష్ణ.. పర్లాకిమిడిలో ధాన్యం, అపరదినుసులు కొనుగోలు చేసి, విశాఖపట్నంలో వరదరాజులు అనే మరో వ్యాపారికి విక్రయించాడు. ఆయన దగ్గర నుంచి రూ. 55 లక్షల నగదు తీసుకొని మంగళవారం (మే 30) రాత్రి సుమారు 11 గంటల సమయంలో తన స్నేహితుడు, కారు డ్రైవర్ అయిన జయరామ్తో కారులో విశాఖపట్నం నుంచి బయలుదేరాడు.
డెంకాడ మండలం నాటవలస టోల్ ప్లాజా సమీపానికి రాగానే.. కారు ఆపి టీ తాగారు. తిరిగి కారు స్టార్ట్ చేసుకొని వస్తుండగా.. రెండు బైక్లతో నలుగురు దుండగులు కారును అనుసరుస్తూ వచ్చారు. పూసపాటిరెగ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతంలోకి వచ్చే సరికి దుండగులు కారును బైకులతో అడ్డగించారు. వ్యాపారి వంశీకృష్ణ కారును ఆపొద్దని డ్రైవర్ జయరామ్కు చెప్పినప్పటికీ.. కారు ఆపుతున్నారు కదా ఏంటో చూద్దాం సార్ అని చెప్పి, వాహనాన్ని స్లో చేసి, కారు అద్దాలు కిందికి దింపాడు.
ఇంతలో దుండగులు వారి దగ్గర ఉన్న నాటు తుపాకులు చూపించి బెదిరించి, వారిద్దరి కంట్లో కారం కొట్టి.. వెనుక సీట్లో ఉన్న 50 లక్షల రూపాయలు అపహరించుకొనిపోయారు. వ్యాపారి వంశీకృష్ణ నేరుగా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్కు వచ్చి ఘటనపై ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa