ఏపీ సీఎం జగన్ అమరావతిలో పేద ప్రజలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. విశాఖలో దశపల్లా భూములు, వైసీపీ నేతలు దోచుకున్న భూముల్లో పేదలకు జగన్ ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. అనకాపల్లి జిల్లా బయ్యారంలో వైసీపీ నేతలు అక్రమ లే అవుట్ వేశారన్నారు. 600 ఎకరాల్లో గుడివాడ అమర్, విజయ సాయి రెడ్డి బినామీలతో వెంచర్ వేశారన్నారు. గుడివాడ అమర్, విజయ సాయి రెడ్డి రికార్డులు తారుమారు చేసి...కబ్జా చేశారని ఆరోపించారు. ఎవరూ కొని మోసం పోవద్దని.. 2024 ఎన్నికల్లో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని బుద్దా వెంకన్న అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa