ఏపీలోని సీమ జిల్లాల మధ్య రహదారులు రక్తమోడాయి... అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లాల సరిహద్దు ప్రాంతం పీలేరు సమీపంలోని ఎంజీఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులకు ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
మృతి చెందిన వారిని కర్నూలుకు చెందిన ప్రతాపరెడ్డి, శివమ్మ, విమలగా గుర్తించారు. క్షతగాత్రుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానిక నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. మృతులు, క్షతగాత్రులను సమీపంలోని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ వారిలో ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఈ ప్రమాదంపై చిత్తూరు జిల్లా కల్లూరు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపడుతున్నారు.
ప్రతినెల పౌర్ణమికి రాయలసీమ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షణ నిమిత్తం తిరువన్నామలైకి వెళుతూ ఉంటారు. గిరి ప్రదక్షణ కోసం కొంతమంది తుఫాన్ వాహనంలో వెళుతుండగా ఆగి ఉన్న లారీతో ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఘోర ప్రమాదం చోటు చేసుకోవడం పలువురిని కలచివేసింది. మృతదేహాలకు డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa