ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ మధ్యంతర బెయిల్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రాఘవ కు బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది. జూన్ 12న సరెండర్ కావాలని ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ సందర్భంగా వాడీవేడి వాదనలు జరిగాయి.
రాఘవ అమ్మమ్మకు అనారోగ్యం కారణంగా ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరీ చేసింది. అమ్మమ్మ బాత్రూంలో జారిపడినందుకు బెయిల్ మంజూరీ చేయడం సబబు కాదని ఈడీ తరపు న్యాయవాది ఏఎస్జిఎస్వి రాజు వాదించారు. ఐసీయూలో ఉన్నప్పుడు ఎవరినీ చూడడానికి అనుమతించరని.. మాగుంట రాఘవ మాత్రమే అమ్మమ్మను చూసుకోవాల్సిన అవసరం లేదని ఈడీ వాదించింది. అయితే.. రెండు వారాలు మాత్రమే రాఘవకు హైకోర్టు బెయిల్ మంజూరీ చేసిందని రాఘవ తరపు లాయర్ దేశాయ్ కోర్టుకు వివరించారు.
మొదట నాయనమ్మ బాత్రూంలో జారిపడిందని చెప్పారని.. నాయనమ్మ అయితే రాఘవ తండ్రి ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఉన్నారుగా చూసుకోవడానికి అన్నప్పుడు.. కాదు కాదు అమ్మమ్మ అని మళ్లీ అబద్దం చెప్పారని ఈడీ కోర్టుకు వివరించింది. తన భార్య ఆత్మహత్యాయత్నం చేసుకుందంటూ మధ్యంతర బెయిల్ కోరారని.. దాన్ని ట్రయల్ కోర్టు కొట్టివేసిందని ఈడీ తరపు లాయర్ కోర్టుకు వివరించారు. రాఘవ బెయిల్పై విడుదలై రెండు రోజులైందని.. ఇప్పటికే వాళ్ల అమ్మమ్మను రాఘవ చూసి రావచ్చని ఈడీ వ్యాఖ్యానించింది. దీంతో సుప్రీంకోర్టు నిర్ణయం వెలువరించింది. ఈనెల 12న సరెండర్ కావాలని స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa