ఉదయగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత మేకపాటి చంద్రశేఖర్ రెెడ్డి టీడీపీ పార్టీలో చేరనున్నారా అన్న చర్చ మొదలైంది. ఇదిలావుంటే తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి శనివారం భేటీ అయ్యారు. బద్వేలు నియోజకవర్గం అట్లూరులో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు మేకపాటి సంఘీభావం తెలిపారు. ఈ నెల 13వ తేదీన ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించనున్న నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై ఈ సందర్భంగా లోకేష్తో చర్చించారు. మేకపాటితో పాటు బద్వేల్కు చెందిన టీడీపీ నాయకులు కూడా లోకేష్ను కలిశారు.
అనంతరం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నారా లోకేష్ను కలిసి తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. యువగళం పాదయాత్ర ఉదయగిరిలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఆయన్ని ఆహ్వానించాలని ఇక్కడికి వచ్చినట్లు పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్రను విజయవంతం చేస్తామని వెల్లడించారు.
ఇక, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఐదు సార్లు కలిసినా లాభం లేదని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ పదవి మాత్రమే ఇస్తానని హామీ ఇచ్చారని.. ఇక లాభం లేదనుకొని పార్టీ నుంచి బయటికి వచ్చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే తాను తెలుగు దేశం పార్టీలో చేరతానని పేర్కొన్నారు. తనతో పాటు నెల్లూరు జిల్లా నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరతారని వెల్లడించారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పోటీ చేస్తానని.. ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తానని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ప్రకటించారు. ఉదయగిరి నియోజకవర్గంలో తాను, వెంకటగిరిలో ఆనం రామనారాయణరెడ్డి లోకేష్ పాదయాత్రను ఆహ్వానిస్తామని ఎమ్మెల్యే మేకపాటి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa