ఇప్పటికీ తాము జనసేనతో పొత్తులోనే ఉన్నామని.. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 9 ఏళ్ల సుపరిపాలనను విశాఖలో అమిత్షా వివరిస్తారని వ్యాఖ్యానించారు. ఏపీలో ల్యాండ్, ఇసుక స్కాములు జరుగుతున్నాయని జీవీఎల్ ఆరోపించారు. ఏపీలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చే విధంగా బీజేపీ పని చేస్తుందని జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు.
తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. 'మా ప్రాంతంలో రూ.150 కోట్ల భూస్కామ్ జరిగింది. ల్యాండ్, లిక్కర్ భూ మాఫియాలు జరగడం లేదా? అసలు బీర్లు ఏంటి? బ్రాండ్లు ఏంటి? ఇసుక దోపిడీ ఎవరి జేబుల్లోకి వెళ్తుంది. మేము ఇచ్చిన డబ్బుల్లో మీ దోపిడీ కనిపిస్తుంది' అని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.
ఇటు కేంద్ర హోంమంత్రి విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో.. అమిత్ షా పర్యటనను వ్యతిరేకిస్తూ.. స్టీల్ ప్లాంట్ కార్మికులు రోడ్డెక్కారు. బీజేపీ హఠావో దేశ్ బచావో నినాదాలతో హైవేపై ఆందోళన చేశారు. సేవ్ స్టీల్ ప్లాంట్ పేరుతో హైవేపై కార్మిక సంఘాలు ఆందోళన చేశాయి.
శనివారం నిర్వహించిన సభలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. 'ప్రధాని వచ్చి రాజధానికి శంకుస్థాపన చేసినా ఇప్పటికీ ఏమీ జరగలేదు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను ఇబ్బందులకు గురి చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారింది. ఇలాంటి పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు. దేశంలో మోదీ ఓటు బ్యాంక్ రాజకీయాలను మార్చారు. ఓటు బ్యాంక్ రాజకీయాలను జవాబుదారీ రాజకీయాలుగా, ఫలితాలు చూపే పారదర్శక రాజకీయాలుగా మార్చిన ఘనత మోదీదే. 9 ఏళ్లుగా ఈ దేశానికి మోదీ సుపరిపాలన అందించారు' అని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa