రాష్ట్రాన్ని అవినీతిమయంగా చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దె దించాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్రాజు పిలుపునిచ్చారు. సీఎం జగన్పై ఉన్నన్ని కేసులు మరే సీఎంపైనా లేవని, ప్రజలకు మేలుచేస్తారని భావించి 151 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే... వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు 26వేల ఎకరాలు ఇస్తే, వారిని జగన్ దగా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దయనీయ స్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారని మండిపడ్డారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు క్లియర్ చేయడం లేదని, తానూ బాధితుడినేనన్నారు. దేశంలోని ఇతర సీఎంల దగ్గర ఉన్న డబ్బు కంటే ఎక్కువ జగన్ దగ్గర ఉందన్నారు. విశాఖలో అద్భుతమైన రుషికొండను గుండు కొట్టించారని ఆరోపించారు. విశాఖలో ఎక్కడ చూసినా అరాచకమే కొనసాగుతోందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa