రోజ్గార్ మేళా కింద కొత్తగా ఎంపికైన 70,000 మంది ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నియామక పత్రాలను అందజేయనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా ఎంపికైన ఈ ప్రభుత్వ ఉద్యోగులు వివిధ ప్రభుత్వ శాఖల్లో చేరనున్నారు. ఉద్యోగాల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ గతేడాది అక్టోబర్లో ఈ రోజ్గార్ మేళాను ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa