పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు ని నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు బుధవారం ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే నివాసంలో నాయకులు శాలువాలతో ఎమ్మెల్యే ని సత్కరించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పెదకూరపాడు నియోజకవర్గానికి విచ్చేసిన సీఎం జగన్ పర్యటనను విజయవంతం చేయడంతో పాటు 217 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేసేలా కృషి చేసిన ఎమ్మెల్యే కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పెదకూరపాడు నియోజకవర్గ రూపురేఖలు మార్చబోయే కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. బహిరంగసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి మరిన్ని హామీల అమలుకు అంగీకరింపచేయడం ఎంతో సంతోషకరమన్నారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి జరగాలంటే ఎమ్మెల్యే నంబూరు శంకరరావు నాయకత్వంతోనే సాధ్యమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa