జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి’ విజయయాత్ర చేపట్టిన కొద్దిసేపటికే అపశ్రుతి చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా, కత్తిపూడి వద్దకు పవన్ కళ్యాణ్ వస్తున్న క్రమంలో ఓ యువకుడికి విద్యుత్ షాక్ తగిలి కిందపడిపోయాడు. వారాహి యాత్ర సందర్భంగా సౌండ్ స్పీకర్లు బిగిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధిత యువకుడిని వెంటనే చేబ్రోలు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది.
అంతకు ముందు జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నవరం దేవస్థానానికి చేరుకుని.. సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ‘వారాహి’ వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహంచారు. అనంతరం అన్నవరం నుంచి కత్తిపూడి సభకు పవన్ బయల్దేరారు. కత్తిపూడిలో నిర్వహించనున్న తొలి బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే యువకుడిని విద్యుత్ షాక్ కొట్టింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa